తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Friday, January 29, 2010

మొదటి హరిహర రాయలు

మొదటి హరిహర రాయలు
పరిపాలన కాలము -> 1336 నుంచి 1356 వరకు

మొదటి హరిహర రాయలు, విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన తొలి పాలకుడగును. పరిపాలనకు వచ్చిన తొలి రోజులలో ఇతను హొయసల రాజ్యపు ఉత్తర భూభాగాలను మాత్రమే పరిపాలించినట్లుగా తెలియుచున్నది.

1343 వ సంవత్సరమునందు, హొయసల సామ్రాజ్యపు చక్రవర్తియగు మూడవ వీరబళ్లాలుడు అకాలముగా మరణించెను. ఈ అవకాశమును ఉప్యోగించి, రాజులేని హొయసల సామ్రాజ్యమంతయూ మొదటి హరిహర రాయలు తమ రాజ్యమున కలుపుకొనెను.


దిగ్విజయ దండయాత్రలు =>

మొదట, మొదటి హరిహర రాయలు, తన తమ్ముడగు మొదటి బుక్క రాయల సహాయముతో, తుంగభద్ర లోయ ప్రాంతమును తన ఆధీనములోకు తెచ్చుకొనెను. ఆ తరువాత, కొంకణ మరియు మలబారు తీరములపై దండెత్తి, విజయము సాధించెను.
ఆ సమయముననే, హొయసల సామ్రాజ్యము పతనమైనది. చివరి పాలకుడగు మూడవ వీర బళ్లాలుడు, మధుర సుల్తానుతో పోరాడు సమయమున మరణించెను. ఇందువలన ఏర్పడిన పాలనశూన్యత వలన, నూనెలేని దీపములాగా ఆరిపోయే పరిస్ధితిలో ఉన్న హొయసల సామ్రాజ్యమును, మొదటి హరిహర రాయలు, ఆక్రమించి, స్వాధీనపరుచుకొనెను. ఇందువలన విజయనగర సామ్రాజ్యము విస్తరించినది. అంతేగాక, దక్షిణ భారతమున గొప్ప సామ్రాజ్యముగా పేర్కొన్నది.

1346 నాటి శృంగేరి తామ్రశాసనమునందు, మొదటి హరిహర రాయలు రెండు సముద్రాల మధ్యగల భూమికి అధిపతియని చెప్పబడినది.దండయాత్రల నుంచి రాజధానికి వెనుదిరిగిన మొదటి హరిహర రాయలు, సుస్ధిరమైన పాలనా వ్యవస్ధను ఏర్పరిచెను. ఇందువలన రాజ్యము సుస్ధిరమైనది.

మొదటి హరిహర రాయల తరువాత, అతని తమ్ముడగు మొదటి బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యపు రత్న సింహాసనమును అధిష్టించెను.


No comments:

Post a Comment