తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Saturday, January 30, 2010

రెండవ హరిహర రాయలు

రెండవ హరిహర రాయలు
పరిపాలన కాలము - 1377 నుంచి 1404 వరకు

మొదటి బుక్క రాయల మరణానంతరము, అతని కుమారుడైన రెండవ హరిహర రాయలు పాలనకు వచ్చెను.
ఇతను పాలనకు రాగానే, తన తండ్రిగారి పాలనాకాలమునందు నియమించబడిన సామంతులు కొందరు స్వంతంత్రించవలెనన్న అభిలాషతో యుద్ధము చేయుటకు సిద్ధమయ్యారని తెలిసి, వెంటనే వారిని తొలగించి, తన పుత్రులను సామతులుగా నియమెంచెను. ఉదయగిరి ప్రాంతమునకు మొదటి దేవరాయలను, మరియు మధుర ప్రాంతమునకు మొదటి విరూపాక్ష రాయలను సామంతులుగా నియమించెను.

యుద్ధములు ->
ఎంతటి సంధి కుదుర్చుకొన్ననూ, విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్ధము తప్పలేదు. 1378 వ సంవత్సరమున, బహుమనీ సుల్తానైన ముజాహీద్ షా, దారుణముగా హతమార్చబడెను. దీనితో బహుమనీ రాజ్యమునందు, అంతఃకలహాలు మొదలైనవి. అదే సంవత్సరమునందు, బహుమనీ
సామ్రాజ్యపు సింహాసనమును శాంతి శీలుడైన రెండవ ముహమ్మద్ షా అధిష్టించెను. కానీ, అప్పటికే దక్షిణ దేఅమంతయూ పరిస్థితులు, గంధరగోళముగా ఉండేవి. కొండవీడు రాజ్యమునందు,
పెద్ద కోమటి వేమా రెడ్డి, కుమార గిరి రెడ్డి మరియు కాటయ వేమా రెడ్ల మధ్య తరచూ యుద్ధములు జరుగుచుండేవి. ఇలా విడిపొవుటకు సిద్ధముగానున్న, కొండవీడు రాజ్యమునూ మరియు అప్పటికే దక్షిణ భారత దేశమంతా వ్యాపించియున్న విజయనగర సామ్రజ్యమునూ, ఆక్రమించాలన్న కోరికతో, రేచర్ల పద్మనాయకుడను ఒక పాలకుడు, బహుమనీ సులతానుతో స్నేహము చేసుకొనెను. ఈ రెండు రాజ్యములను ఆక్రమించుటకై, బహుమనీ సుల్తానుతో కలిసి ఓ గొప్ప పధకమును రూపొందించెను. ఇటువంటి పరిస్ధితులలో, రెండవ హరిహర రాయలు , కొండవీడు రాజ్యమునకు చేరిన శ్రీశైలం ప్రాంతమును స్వాధీనపరచుకొనెను. ఇందుకు కోపగించిన కాటయ వేమా రెడ్డి, తన సైన్యమును వెంటబెట్టుకొని, విజయనగర సైన్యమును ఎదుర్కొని, ఓడించెను. తప్పనిసరి పరిస్ధితులలో, రెండవ హరిహర రాయలు, కాటయ వేమా రెడ్డితో సంధి చేసుకొనెను. అంతేగాక, తన కొమర్తెయైన లక్ష్మిని, కాటయ వేముని కొడుకొతో పెళ్ళి జరిపించెను.

ఉదయగిరి ప్రాంతమునకు సామతునిగా నియమించబడిన, రెండవ హరిహర రాయల కొడుకైన మొదటి దేవరాయలు, ఓ గొప్ప సైన్యమును ఏర్పరచి, మోటుపల్లి రేవును ఆక్రమించెను. అప్పటికే కొండవీడు రాజ్యమును పాలించుచున్న కుమార గిరి రెడ్డిపై పెద్ద కోమటి వేమారెడ్డి యుద్ధము చేసి, విజయవంతముగా కొండవీడు రాజ్యమును తన సొంతము చేసుకొనెను. కొండవీడు రాజ్యమునకు రాజువైన కొన్ని రోజులలోనే, రెండవ హరిహర రాయలు, ఈ ప్రాంతమును వశపరుచుకొనుటకు, చౌండ సేనానిని ఓ గొప్ప సైన్యముతో, కొండవీటి రాజువైన పెద్ద కోమటి వేమారెడ్డి పై పంపెను. ఇందుకు పెద్ద కోమటి వేమా రెడ్డి, తన సైన్యముతో బయలుదేరి, విజయనగర సైన్యములను ఎదిరించి, వారిని ఓడించి, కొండవీటి సరిహద్దును దాటిరాలేక తరిమివేసెను. ఈ యుద్ధము "మోటుపల్లి యుద్ధము"గా ప్రసిద్ధమైనది.

అప్పటికే మెల్లమెల్లగా, రేచర్ల పద్మనాయకులు, విజయనగర సామ్రాజ్యమునకు చెందిన కొన్ని చిన్న చిన్న ప్రదేశాలను తన ఆధీనములోకు తెచ్చుకొనుట మొదలుపెట్టెను. దీనిని చూచి కోపిగించిన రెండవ హరిహర రాయలు తన పెద్ద కొడుకైన రెండవ బుక్క రాయలను, రేచర్ల పద్మనాయకుల పై పంపెను. రెండవ బుక్కరాయల సైన్యమును ఎదిరించుటకై, రేచర్ల పద్మనాయకులు, బహుమనీ సుల్తాను యొక్క సహాయము పొందెను. ఇరువురు అధిపతులు కలిసి, కొత్తకొండ ప్రాంతమున విజయనగర సైన్యములను ఓడించిరి. విజయనగర సేనలో వున్న సాళువ రామదేవుడు వంటి గొప్ప వీరులు, ఈ యుద్ధముననదు తమ ప్రాణాలు కోల్పోయిరి. అపజయము పొందిన రెండవ బుక్క రాయలు విజయనగరమునకు తిరిగివచ్చెను.

ఈ అపజయమును, రెండవ హరిహర రాయలు సహించలేకపోయెను. ఓ గొప్ప సైన్యమును ఏర్పర్చెను. అంతేగాక, గండదండాధీసుడు వంటి గొప్ప వీరులను ఆ సైన్యమునకు సైన్యాధీశులుగా చేసి, మరొక సైన్యమును ఏర్పరచి, అందుకు రెండవ బుక్క రాయలను సైన్యాధీసునిగా చేసి, రేచర్ల పద్మనాయకులపై పంపెను. రెండు పక్షాల మధ్య, ఓ భయంకరమైన యుద్ధము జరిగినది. ఈ యుద్ధము 1397 వ సంవత్సరమునందు జరిగినది. రేచర్ల పద్మ నాయకులు, బహుమనీ సుల్తాను యొక్క సహకారము పొందవలెనని చూచెను. కానీ, అంతలోనే విజయనగర సైనికులు, కృష్ణా నదీ ఉత్తర భాగమున రేచర్ల పద్మనాయకుల రాజ్యపు ముఖ్యమైన కోటైన పానుగల్లు కోటను ముట్టడించి, ఆక్రమించిరి. అంతేగాక, చౌల్, ధాబోల్ వంటి ప్రాంతాలను కూడా వశపరుచుకొనిరి.

మధుర ప్రాంతమునకు సామంతునిగా నియమింపబడిన, మొదటి విరూపాక్ష రాయలు, ఓ గొప్ప గొప్ప నావికా సైన్యమును అభివృద్దిచేసి, సముద్రమును దాటి, సింహళ దేశము పై దాడి చేసెను. సింహళ రాజ్యమును పాలించుచున్న, అధిపతులు నలుగురు కలిసి, ఈ దాడిని ఎదుర్కొనిరి. కానీ, దురాదృష్టము వారు వెంటపడినందున, నలుగురు కలిసినా, మొదటి విరూపాక్ష రాయల ముందు ఓటమి చెందవలసి వచ్చినది. అంతేగాక మొదటి విరూపాక్ష రాయలు ఆ నలుగురు అధిపతులను తొలగించి, తమ రాజ్యము నుంచి ఆ ప్రాంతమునకు ఇరువురు రాజులను సామతులుగా నియమించెను. సామతులుగా నియమితులైన రాజులు, విజయనగరాధీశులైన రెండవ హరిహర రాయలకు కప్పమును చెల్లించిరి.
సింహళ రాజులతో జరిగిన యుద్ధము భారత దేశపు చరిత్రలోని గొప్ప యుద్ధాలులో ఒకటైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటి సారిగా, ఓ అధిపతి, ఒక గొప్ప నావికాదళమును రూపొందించి, సముద్రాలను దాటి పోరు చేసియున్నాడు. ఇది ఒక గొప్ప సాధనే కాదా!.


కొండవీడు రాజ్యమున జరిగిన కలహాలవలన, ఆ రాజ్యమునందు పరిస్ధితులు రోజు రోజుకు గంధరగోళముగా మారసాగినవి. రెండవ హరిహర రాయాలు, ఈ అవకాశమును తమకు అనుకూలముగా వాడుకొని, కొండవీడు రాజ్యమునకు చేరిన కొన్ని ముఖ్యమైన ప్రానతములను తమ ఆధీనములోకు తెచ్చుకొనుటకు, ఓ సైన్యముతో బయలుదేరెను. అప్పటికే, కొండవీడు రాజ్యము చేజారిందన్న కోపముతో, కొండవీటి పాలకుడైన పెద్ద కోమటి వేమా రెడ్డిపై పగపట్టిన కాటయ వేమా రెడ్డి, విజయనగర ప్రభువులైన మొదటి హరిహర రాయలతో కలిసి, పెద్ద కోమటి వేమా రెడ్డిపై యుద్ధము చేసిరి. విజయము సాధించిరి.

న్యాయముగా, నియమాల ప్రకారము, రెండవ హరిహర రాయల తరువాత తన పెద్ద కుమారుడైన రెండవు బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యపు సింహాసనమును అధిష్టించవలెనుగానీ, గొప్ప సైన్యమును ఏర్పరుచుకొని, సింహళ దేశమును జయించినవాడైన మొదటి విరూపాక్ష రాయలు, 1404 వ సంవత్సరమునందు బలవంతముగా సింహాసనమును ఎక్కెను.

No comments:

Post a Comment