తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Friday, February 5, 2010

మొదటి దేవరాయలు

మొదటి దేవరాయలు
పరిపాలన కాలము -> 1406 నుంచి 1422 వరకు












మొదటి దేవరాయలు రెండవ హరిహర రాయల కొడుకగును. ఇతను, తన అన్నగారైన రెండవ బుక్క రాయల నుంచి, రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకొని, రెండవ బుక్క రాయలను తొలగించి, 1406 వ సంవత్సరమునందు, సామ్రాజ్యపు సింహాసనమును ఎక్కెను.
















దండయాత్రలు ->

ఇతను పరిపాలనకు వచ్చిన తొలి రోజులలోనే, విజయనగర సామ్రాజ్యమునందు జరిగిన కలహాల కారణముగా, తన సైన్యమునకు సరైన సైన్యాధిపతిని నియమించలేకపోయెను. దాడి చేసినచో, ఎదుర్కోలేని పరిస్ధితిలో వున్న విజయనగర సేనల గురించి తెలుసుకున్న, ముస్లీం రాజు ఫిరోద్ షా, ఈ అవకాశమును ఉపయోగించి, తన సైన్యముతో విజయనగరముపై దండయాత్రకు బయలుదేరెను. ఫిరోద్ షా యొక్క అంచనా వేసినట్లుగానే, విజయనగర సైనికులు ఈ దండయాత్రను ఎదిరించలేకపోయిరి. విజయనగరము ఈ యుద్ధమునందు ఓడిపోయినది. ఓడిపోవుటేగాక, ఫిరోద్ షాకు విజయనగర ప్రభువులైన మొదటి దేవరాయలు, 32 లక్ష రూపాయలు చెల్లించవలసి వచ్చినదని, సయ్యదాలి వ్రాతలు తెలుపుచున్నవి.

ఈ యుద్ధమును అనుసరించి, మొదటి దేవరాయలు, ఉదయగిరి రాజ్యముపై దాడి చేసి, ఆ రాజ్యమునకు చేరిన పులుగునాడు మరియు పొత్తపినాళ్ళను, స్వాధీనపరుచుకొనెను.
ఫిరోద్ షాపై జరుగిన యుద్ధమునందు పొందిన అపజయమునకు బాధపడి, మొదటి దేవరాయలు రాజమండ్రిని పరిపాలించుచున్న కాటయవేమునితో స్నేహముచేసుకొని,ఇరువురూ కలిసి ఫిరోద్ షాపై యుద్ధముచేయుటకు గొప్ప పధకమును రూపొందించిరి. కానీ, అంతలో కొండవీటి పెద్దకోమటి వేమా రెడ్డి మరియు అతని స్నేహితుడగు అన్నదేవచోడునితో కలిసి ఫిరొద్ షాతో స్నేహము చేసుకొని, విజయనగర ప్రభువులైన మొదటి దేవరాయలు మరియు కాటయవేముని సైన్యములను ఎదుర్కొనిరి.
ఈ యుద్ధమునందు, పెద్దకోమటి వేమా రెడ్డితో పోరాడు సమయమున, మొదటి దేవరాయల మిత్రుడైన కాటయ వేముడు మరణించెను. దానితో కాటయ వేముని బలాన్ని కోల్పోయిన మొదటి దేవరాయలు, అలాడ రెడ్డి మరియు అతని కొమారులగు వేమా మరియు వీరభద్ర రెడ్లతో కలిసి, విరోదులైన ఫిరోద్ షా  మరియు పెద్ద కోమటి వేమ రెడ్డితో పోరడి విజయము సాధించెను.
ఇటువంటి ఓటమిని పొందిన పిమ్మట, ఫిరోద్ షా తన సైన్యములతో కలిసి పానుగల్లు దుర్గమును ఆక్రమించెను. కానీ కొండవీడు- బహుమనీల స్నేహమును చూసిన రేచర్ల పద్మనాయకులు, విజయనగర ప్రభువులతో స్నేహము చేసుకొనెను. ఆ తరువాత కోల్పోయిన పానుగల్లు దుర్గమును తిరిగి సొంతము చేసుకొనుటకై రేచర్ల పద్మనాయకులు మరియు మొదటి దేవరాయలు కలిసి, ఫిరోద్ షాతో యుద్ధమునకు బయలుదేరిరి. కానీ సులువుగా సాధించలేని ఆ దుర్గమునకొఱకు, వారిరువురూ రెండు సంవత్సరాలు కష్ట పడి పోరాడి చివరకు విజయము సాధించిరి.
 ఆ తరువాత, విజయనగర ప్రభువులు, బహుమనీ సుల్తానుకు కొండవీటి రాజుల నుండి ఎటువంటి సహాయము రాకుండా చేయుటకు, తీరాంధ్ర ప్రదేశమును ఆక్రమించుటకు ఓ గొప్ప సైన్యమును అచ్చటి పాలకులపై పంపెను.ఈ సైన్యము, ఓ గొప్ప సైన్యాధిపతి యొక్క నాయకత్వముతో పొత్తపినాడు, పులుగునాడు మరియు మోటుపల్లి రేవును ఆక్రమించినది.
మొదటి దేవరాయలు, ఈ రెండు యుద్ధములందు, విజయాలు సాధించి బహుమనీ సుల్తాను మరియు కొండవీటి రాజును ఓడించి, నల్గిండ, పానుగొల్లు, కోస్తాంధ్ర ప్రదేశాలను మొత్తము స్వాధీనపరుచుకొనెను.

మొదటి దేవరాయలు తన పరిపాలన కాలమున సాధించిన విజయాలు, విజయనగర సామ్రాజ్యమును చరిత్రలు ఓ ఉన్నత స్దానమునందు వుంచుటకు తోడ్పడ్డాయి.

మొదటి దేవరాయలు తను సాధించిన స్ఫూర్తివంతమైన విజయాలతోపాటు రాజధాని నగరమును చక్కగా పటిష్ట పరచి,  కోట గోడలూ, బురుజులూ కట్టించి, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించి, వ్యవసాయాన్ని అభివృద్ది చేసెను.
ఇతని పరిపాలన కలమున, రాజధానియైన విజయనగరము 60 మైళ్లు విస్తరించినట్లుగా ఐరోప్పియన్ పయనికుడు నికోలస్ కాంటి వివరించియున్నాడు.మరొక గమనించవలసిన విషయమేమిటంటే, విక్రమార్క చరిత్రను రచించిన జక్కన కవి ఇతని కాలమువాడే.

మొదటి దేవరాయలు మరణించిన తరువాత, తన కుమారుడైన రామచంద్రరాయలు పాలనకు వచ్చెను.


No comments:

Post a Comment