రామచంద్రరాయలు
పరిపాలన కాలము -> 1422 వ సంవత్సరము మాత్రమే
మొదటి దేవరాయల మరణానంతరము, 1422 వ సంవత్సరమునందు రామచంద్రరాయలు పరిపాలనకు వచ్చెను. తన తండ్రిగారైన మొదటి దేవరాయలవలె ఇతను గొప్ప విజయములు సాధించినవాడు కాడు, సామ్రాజమును పరిపాలించగలిగే సమర్ధుడు అంతకన్నా కాడు.
పాలనకు వచ్చిన నాలుగు మాసాలలోనే, తన తమ్ముడైన వీర విజయ బుక్క రాయలు, ఇతనిని తొలగించి, విజయనగర సామ్రాజ్యపు సింహాసనమును అధిష్టించెను.
దాదారెడ్డి పల్లెలోనుంచి దొరికిన, 1416 వ సంవత్సరపు శాసనాల ప్రకారము, రామచంద్ర రాయలు, తన తండ్రిగారి పరిపాలన కాలమునందు ఉదయగిరి ప్రాంతమునకు అధిపతిగా వుండెనట.