తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Showing posts with label 4. మొదటి విరూపాక్ష రాయలు. Show all posts
Showing posts with label 4. మొదటి విరూపాక్ష రాయలు. Show all posts

Thursday, February 4, 2010

మొదటి విరూపాక్ష రాయలు

మొదటి విరూపాక్ష రాయలు
పరిపాలన కాలము -> 1404 నుంచి 1405 వరకు

రెండవ హరిహర రాయల మరణము తరువాత, మొదటి విరూపాక్ష రాయలు, తన అన్నగారైన రెండవ బుక్క రాయల వద్ద నుంచి సింహాసనమును బలవంతముగా అపహరించెను. కానీ, ఇతను చాలా తక్కువ కాలమునకు మాత్రమే పరిపాలించగలిగెను.

మొదటి విరూపాక్ష రాయలు, పాలనకు వచ్చి ఒక సంవత్సరము తరువాత, తన అన్నగారైన రెండవ బుక్క రాయలు సామంతులు మరియు విధేయుల సహాయమును పొంది, ఇతనిని తొలగించి, విజయనగర సామ్రాజ్యపు రత్న సింహాసనమును స్వాధీనపరుచుకొనెను.

ఇతని సాధనలను గురించి చెప్పవలెనంటే, తన తండ్రి గారైన రెండవ హరిహర రాయల హయాములో, ఓ గొప్ప నావికా సైన్యమును ఏర్పరుచుకొని, సముద్రమును దాటి, సింహళ రాజ్యమును సాధించెను.

మొదటి విరూపాక్ష రాయల పరిపాలన కాలమునందు, అతను గోవా, చావుల్, ధాబోలు వంటి ప్రదేశాలను విరోదుల వద్ద కోల్పోయెనని, పయనికుడు పెర్నోవో నూనీజ్, విజయనగర సామ్రాజ్యమును గురించి వ్రాసిన పుస్తకములో చెప్పియున్నాడు.