వంశ పరంపర
విజయనగర సామ్రాజ్యమును నాలుగు వంశాలకు చేరిన అధిపతులు పరిపాలించారు. ఈ నాలుగు వంశాలలో మొదటి వంశమైన సంగమ వంశమునకు చెందిన రాజులు, విజయనగర సామ్రాజ్యమును భారత దేశపు దక్షిణ భాగమంతయూ విస్తరించారు.అంతేగాక వీరి పరిపాలన కాలమునందే అద్భుతమైన కట్టడాలు, శృంగారవంతమైన రాతిశిల్పాలు, కాలాకాలమునకూ అందాన్ని కోల్పోని గజశాలాలవంటి మొదలైనవి కట్టబడినవి. మొత్తానికి, ఈ వంశము వలనే, విజయనగర సామ్రాజ్యము గొప్ప సామ్రాజ్యముగా ప్రసిద్ధత చెందినది. కావున ఈ వంశమునకు చేరిన రాజులు విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన నాలుగు వంశాలలోనూ పేర్కొన్నారు. సంగమ వంశమూ ప్రసిద్ధమైనది.
సంగమ వంశమునకు చేరిన చక్రవర్తులు :-
మొదటి హరిహర రాయలు | 1336-1356 |
మొదటి బుక్క రాయలు | 1356-1377 |
రెండవ హరిహర రాయలు | 1377-1404 |
మొదటి విరూపాక్ష రాయలు | 1404-1405 |
రెండవ బుక్క రాయలు | 1405-1406 |
మొదటి దేవ రాయలు | 1406-1422 |
రామచంద్ర రాయలు | 1422 |
వీర విజయ బుక్క రాయలు | 1422-1424 |
రెండవ దేవ రాయలు | 1424-1446 |
మల్లికార్జున రాయలు | 1446-1465 |
రెండవ విరూపాక్ష రాయలు | 1465-1485 |
ప్రౌఢ రాయలు | 1485 |
శాళువ వంశమునకు చేరిన చక్రవర్తులు -
సాళువ వంశపు మొదటి నరసింహ రాయలు | 1485-1491 | |
తిమ్మ భూపాలుడు | 1491 | |
| 1491-1505 | |
తుళువ వంశమునకు చేరిన చక్రవర్తులు -
వీరనరసింహ రాయలు | 1491-1509 |
శ్రీ కృష్ణదేవ రాయలు | 1509-1529 |
తుళువ అచ్యుత రాయలు | 1529-1542 |
తుళువ సదాశివ రాయలు | 1542-1570 |
అరవీడు వంశమునకు చేరిన చక్రవర్తులు -
అరవీటి రామరాయలు | 1542-1565 |
తిరుమల దేవ రాయలు | 1565-1572 |
మొదటి శ్రీరంగ రాయలు | 1572-1586 |
రెండవ వెంకట రాయలు | 1586-1614 |
రెండవ శ్రీ రంగ రాయలు | 1614-1614 |
రామదేవుడు | 1617-1632 |
మూడవ వెంకట రాయలు | 1632-1642 |
మూడవ శ్రీరంగరాయలు | 1642-1646 |
వీరు మాత్రమేగాక, మధ్యలో ఇంకా కొందరు చక్రవర్తులు పరిపాలించినట్లుగా ఆధారములు సేకరించబడినవి. కానీ వీరి పరిపాలన కాలములు సందేహాస్పదమైనవి.
No comments:
Post a Comment