తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము

తిరుమలలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహము
ఇచ్చట విజయనగరాధిపతియైన శ్రీకృష్ణదేవరాయలు, తన రెండు భార్యలగు చిన్నమదేవి మరియు తిరుమలదేవులతో నిలిచియున్నాడు

Friday, January 29, 2010

మొదటి బుక్క రాయలు

మొదటి బుక్క రాయలు
పరిపాలన కాలము -> 1356 నుంచి 1377 వరకు

మొదటి హరిహర రాయల తరువాత 1356 వ సంవత్సరమున, మొదటి బుక్క రాయలు పాలనకు వచ్చెను. విజయనగర సామ్రాజ్యపు స్ధాపనలోనూ, మరియు సామ్రాజ్యపు స్ధాపన తరువాత బహుమనీ సుల్తానులతో జరిగిన కొన్ని యుద్ధములలో, మొదటి బుక్క రాయలు, తన అన్నగారైన మొదటి హరిహర రాయలకు సహకరించినట్లుగా, సేకరించబడిన ఆధారములు తెలుపుచున్నవి. అంతేగాక, ముస్లీం సుల్తానుల చేత ఆక్రమింపబడిన, అనేక హిందూ క్షేత్రాలలను, తన కుమారుడగు కంప రాయలను సుల్తానుల పై యుద్ధమునకు పంపి, ఆ క్షేత్రాలకు స్వతంత్రము తెప్పించెను.

దండయాత్రలు -

మొదటి బుక్క రాయల 21 సంవత్సరాల పరిపాలన కాలమునందు, అతను విజయనగర సామ్రాజ్యమును విస్తరించుకొనసాగెను.
1360 వ సంవత్సరములోగా, ఏర్కాడు మరియు కొండవీటి రెడ్ల రాజ్యములను అతను తన ఆధీనములోకు తెచ్చుకొనెను.
అంతేగాక పెనుకొండ ప్రాంతమును ఏలుచున్న రాజును ఓడించి, ఆ ప్రాంతమును కూడ విజయనగరముతో కలుపుకొనెను.
ఆ తరువాత, మదురై రాజ్యమును పాలించిన, సుల్తానుపై యుద్ధము చేసి, రామేశ్వరము వరకు స్వాధీనము చేసుకొనెను.


బహుమనీ సుల్తానైన మొదటి ముహమ్మదు షా, దండయాత్రకు బయలుదేరి, వరంగల్ ప్రాంతముపై దండెత్తెను. ఈ దండయాత్రను ఒకడె ఎదుర్కోలేక, వరంగల్ పాలకుడు మొదటి బుక్క రాయల సహాయము కోరెను. కానీ దురాదృష్టవశాత్తుగా వరంగల్ రాజుకు సహకరించుటకు వచ్చిన మొదటి బుక్క రాయలు కూడా బహుమనీ సుల్తానుచేత అపజయము పొందెను. ఈ అపజయమును సహించలేని మొదటి బుక్క రాయలు, ఓ గొప్ప సైన్యముతో బయలుదేరి బహుమనీ రాజ్యమునకు చెందిన ముద్గల్లు కోటను ఆక్రమించెను. ఇందుకు కోపగించిన బహుమనీ సుల్తాను, తన సేనలను పంపెను. బహుమనీ సేనలు ముందుకు వచ్చి, విజయనగర సేనలను ఎదుర్కొని, రెండు రాజ్యాల మధ్య ఆదోని, కౌతల ప్రదేశాలందు, ఓ భయంకరమైన యుద్ధము జరిగినది. ఈ యుద్ధము వలన సాధారణ ప్రజానీకమునకు, చాలా కష్టాలు ఏర్పడినవి. వేలకొలది ప్రజలు నిరాశ్రయలై, వందల కొలది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయిరి. ఈ మరణాలను చూడలేక మొదటి బుక్క రాయలు, బహుమనీ సుల్తనుతో సంధి కుదుర్చుకొనుటకు నిర్ణయించుకొనెను. చివరకు, మొదటి బుక్క రాయలు, ఈ యుద్ధము వలన తమ ప్రజలకు ఏర్పడిన నష్టమును చూచి, బహుమనీ సుల్తానుతో సంధి కుదుర్చుకొనుటకు నిర్ణయించెను. బహుమనీ సుల్తాను కూడా ఇందుకు సమ్మతించెను. సంధి కుదుర్చుకొన్న పిమ్మట, సంధి షరతులను అనుసరించి, ఇరువురు అధిపతులు తమ తమ ప్రజానీకమునకు ఎటువంటి కష్టాలు కలిగించకుండ, తమ తమ రాజ్యములను శాంతముగా పాలించుచూ స్నేహితులువలె ఉండిపోయిరి.

ఈ యుద్ధము తరువత 1375 వ సంవత్సరము వరకు, శాంతము కొనసాగినది.
1375 వ సంవత్సరమునందు, బహుమనీ సుల్తానైన మొదటి ముహమ్మదు షా మరణించెను. అతని వారసుడగు ముజాహీద్ షా పాలనకు వచ్చెను. ఈ సమయమున, మొదటి బుక్క రాయలు కృష్ణా నదీ మరియు తుంగభద్ర నదీ ప్రాంతముల మధ్యగల ప్రదేశాలను ఆక్రమించెను. అంతే! ముజాహీద్ షా కోపితుడై, ఓ పెద్ద సైన్యమును విజయనగరం పై నడిపెను. శాంతి కొరకు కుదుర్చుకున్న సంధి లేకుండపోయినది. మళ్ళీ మొదలైనది మరొక యుద్ధము. మొదటి బుక్క రాయలు కూడా తమ సైన్యములతో బహుమనీ సైన్యములను ఎదుర్కొనెను. కానీ విజయనగరము, బహుమనుల చేత ఓటమి చెందినది. బహుమనీ సైనికులు, విజయనగర సైనికులు తుంగభద్ర నదీ తీరమును దాటిరాలేక తరిమివేసిరి.

మొదటి బుక్క రాయలు, "ఉత్తమహరివంశము" ను వ్రాసిన నాచన సోమన కవికి, తన ఆస్ధానమున ఆశ్రయము ఇచ్చుచున్నట్లు ఆధారములున్నవి.


No comments:

Post a Comment